నాంపల్లి కోర్టులు, జూలై 27 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ కేసులో 92వ నిందితుడిగా వికారాబాద్ జిల్లాకు చెందిన భానూరి ప్రదీప్కుమార్ను గురువారం 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట సిట్ అధికారులు హాజరుపర్చారు.
మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య ఆగస్టు 9వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం తోకల పవన్కుమార్ను రిమాండ్కు తరలించారు. ఈ కేసులో బుధవారం 8 మంది నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.