హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఆట బాలోత్సవం బ్రోచర్ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హైదరాబాద్ బంజారాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లోని తన నివాసంలో ఆదివారం ఆవిష్కరించారు. అవార్డీ టీచర్స్ అసోసియేషన్, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం, బెక్కంటి శ్రీనివాస్రావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించే ఆట బాలోత్సవ్ను నవంబర్ 12,13, 14న భద్రాచలంలో నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఆట రాష్ట్ర అధ్యక్షుడు బెక్కంటి శ్రీనివాస్రావు, గౌరవాధ్యక్షుడు జనార్దన్, ఆట ఉపాధ్యక్షుడు నయీమొద్దీన్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.