హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి రెండో కుమారుడు భద్రారెడ్డి మరోసారి ఐటీ విచారణకు హాజరయ్యారు. శుక్రవారం హైదరాబాద్లోని ఐటీ శాఖ కార్యాలయంలో ఆయనను అధికారులు మరోసారి ప్రశ్నించారు. కళాశాలల్లో సీట్ల కేటాయింపుపై ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు భద్రారెడ్డి సమాధానాలు చెప్పారు. మొదటి రోజు విచారణలో భాగంగా ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి భద్రారెడ్డి సమాధానమిచ్చారు. తమకు కావాల్సిన ఫార్మాట్లో సమాధానాలు ఇవ్వాలని ఐటీ అధికారులు చెప్ప గా.. రెండోసారి హాజరై ఐటీ అధికారు లు అడిగిన ఫార్మాట్లో వివరాలు అందజేశారు.