హైదరాబాద్ : ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించింది. మొత్తం 50 మంది ఉపాధ్యాయులకు అవార్డులు ప్రకటించగా, ఇందులో 10 మంది హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపళ్లు, 19 మంది ఎస్ఏ, పీఈటీలు, 10 మంది ఎస్జీటీ, టీజీటీలు, లెక్చరర్ల విభాగంలో ఒకరికి అవార్డులు రాగా, మరో పది మందికి ఫోర్ రన్నర్స్ ప్రత్యేక కేటగిరీలో అవార్డులను ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు.