హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులోభాగంగా ఈ నెల 27, 28న హైదరాబాద్లో వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఈ వర్క్షాప్ కోసం సబ్జెక్టుల వారీగా హెచ్ఎంలు, సబ్జెక్టు నిపుణులను ఎంపిక చేశారు. తెలుగుకు 6, రెండోభాషకు 5, ఉర్దూకు 6, హిందీకి 7, ఇంగ్లిష్కు 5, గణితానికి 7, భౌతికశాస్ర్తానికి 6, జీవశాస్ర్తానికి 5, సాంఘికశాస్ర్తానికి 5, హెచ్ంఎంలు ఆరుగురు ఈ వర్క్షాప్కు ఎంపికయ్యారు. శనివారం పర్యవేక్షకులను నియమించగా, తాజాగా వర్క్షాప్లను నిర్వహిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.