హైదరాబాద్, మే14 (నమస్తే తెలంగాణ): పదోతరగతి, ఇంటర్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభచూపిన బీసీ గురుకుల సొసైటీ విద్యార్థులను బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. గురువారం ఆదివాసీ భవన్లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో 508 మంది విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. విద్యార్థుల సాధించిన విజయం తల్లిదండ్రులు, గురువులు, విద్యాసంస్థలకు గర్వకారణమని కొనియాడారు.
గ్రామీణ, పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు కృషి, పట్టుదలతో అద్భుత ఫలితాలు సాధించడం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్యాదవ్, బీసీ సంక్షేమశాఖ ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ సంక్షేమశాఖ సెక్రటరీ బాలమయాదేవి, డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర్రావు, గురుకుల సొసైటీ సెక్రటరీ సైదులు, బీసీ కమిషన్ సభ్యులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పెరిక కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు (డీవీ), వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్కు మంత్రి పొన్నం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. బీసీ కార్పొరేషన్ భవనంలో గురువారం నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న పొన్నం.. పెరికల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్కుమార్, ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, గౌరవ అధ్యక్షుడు మద్దా లింగయ్య, మాజీ అధ్యక్షుడు దాసరి మల్లేశం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్, కోశాధికారి సందెల లింగం తదితరులు పాల్గొన్నారు.