హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పీ శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కులగణనలో బీసీల లెకలు తేలిన తర్వాత కూడా రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. 42 శాతం పెంచినట్టయితే పంచాయతీ సభ్యులుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా బీసీలు అయ్యే అవకాశాలు ఎకువగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ విషయంపై తక్షణమే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.