హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లోకి తీసుకురాలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పష్టంచేశారు. దానికి సుప్రీంకోర్టు అనుమతించదని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి 46సార్లు ఢిల్లీకి వెళ్లారని, ఆ సమయంలో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆయనను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్బీసీలను తప్పుదారి పట్టిస్తున్నదని, బీసీలను మరోసారి మోసం చేసినందుకు ఆ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.