హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బీసీ, ఓసీ విద్యుత్తు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చైర్మన్గా కోడెపాక కుమారస్వామి ఎన్నికయ్యారు. ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లోని బీసీ, ఓసీ ఉద్యోగులు శుక్రవారం హైదరాబాద్ మింట్ కాంపౌడ్లోని విద్యుత్తు బీసీ భవన్లో సమావేశమై ఏకగ్రీవంగా కొత్త జేఏసీని ఎన్నుకున్నారు. కో-చైర్మన్గా ఆర్ సుధాకర్రెడ్డి, కన్వీనర్గా ముత్యం వెంకన్నగౌడ్, కో-కన్వీనర్గా సీ భానుప్రకాశ్, ఫైనాన్స్ సెక్రటరీగా డాక్టర్ సీహెచ్ చంద్రుడు, జాయింట్ సెక్రటరీలుగా జీ బ్రహ్మేంద్రరావు, ఎన్ రాజేందర్, వీ కళాధర్రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పీ యాదగిరి, కే సంపత్రెడ్డి, ఎం విజయకుమార్, జీ రాజేందర్, పబ్లిసిటీ సెక్రటరీలుగా ఎం అశోక్కుమార్, పీ విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎం ప్రేమ్ కుమార్, జీ వెంకట్రావు, పీ అశోక్ ఎన్నికయ్యారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ.. విద్యుత్తు ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా సంబంధిత సంస్థలు జాప్యం చేస్తున్నాయని, దీంతో బీసీ, ఓసీ ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యక్ష నియామకాల్లో ఎంపికైన ఉద్యోగుల సీనియారిటీ ప్రకారం తదుపరి ప్రమోషన్లకు మెరిట్ జాబితాను సిద్ధం చేయాలన్నారు.