హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతున్నదని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు పేర్కొన్నారు. కుటుంబం యూనిట్గా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా, దిక్సూచిగా నిలుస్తున్నదని కొనియాడారు. జాతీయ వీరభద్రీయ కుల సంఘం రూపొందించిన ఉగాది క్యాలెండర్ను గురువారం ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించి, మా ట్లాడారు.
దేశంలో ఎకడా లేని విధంగా తె లంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలు బీసీ, ఎంబీసీలకు అందుతున్నాయని సంతో షం వ్యక్తం చేశారు. కుల వృత్తులు, నిఫుణత, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు, కులవృత్తుల నవీకరణ తదితర అనేక అంశాలపై బీసీ కమిషన్ నిశితంగా అధ్యయనం చేస్తున్నదని, భవిష్యత్లో మరింతగా లబ్ధి చేకూర్చే దిశగా సిఫారసులు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో జాతీయ వీరభద్రీయ కుల సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఉపేంద్ర కర్నె, రాష్ట్ర అధ్యక్షుడు చెవ్వ పాండు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.