Bayer Drone Trail | హెల్త్కేర్, వ్యవసాయ రంగాల్లో కీలక సంస్థలతో పోటీ పడుతున్న బేయర్ సంస్థ మంగళవారం హైదరాబాద్కు సమీపాన చాందీపాలోని తన మల్టీ క్రాప్ బ్రీడింగ్ సెంటర్లో ఫస్ట్ డ్రోన్ ట్రయల్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, పౌర విమానయాన శాఖల ప్రతినిధులు, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ప్రతినిధులు, బేయర్ భాగస్వాములు, పరిశ్రమ వాటాదారులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. కార్యక్రమ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ రంగంలో చిన్న, సన్నకారు రైతుల పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మికుల కొరత, తక్కువ దిగుబడి, అనూహ్య వాతావరణ మార్పుల వంటి పర్యావరణ సవాళ్లు ఎదుర్కొంటున్నారు. డిజిటల్ టెక్నాలజీస్తో డ్రోన్లను వినియోగంలోకి తేవడం ద్వారా అడ్డంకులను అధిగమించవచ్చు. డ్రోన్లతో కీటకాల సంహారం, కలుపు నివారణ, తెగుళ్లకు అడ్డుకట్ట వేయొచ్చు. తెగుళ్ల నివారణకు వాడే రసాయనాల్లో సరైన డోస్ వాడకంతోపాటు ప్రమాదాలను నివారించొచ్చు. అంతే కాదు రైతులకు రియల్ టైం ఆగ్రోనిమిక్ అడ్వైజరీగా పని చేయడంతోపాటు దిగుబడి పెంపునకు, సుస్థిరత సాధనకు డ్రోన్లు ఉపకరిస్తాయి.
బేయర్ క్రాప్ సైన్స్ లిమిటెడ్ సీఈవో అండ్ ఎండీ డీ నారాయణ్ మాట్లాడుతూ ఇప్పటికే ఆసియా ఖండంలోని చిన్న, సన్నకారు రైతులు గల దేశాల్లో డ్రోన్లు నిర్వహిస్తున్నారని చెప్పారు. భారత్లోనూ చిన్న రైతులకు డ్రోన్లతో గణనీయమైన లాభాలు వస్తాయన్నారు. హైదరాబాద్ శివారుల్లో డ్రోన్ ట్రయల్ నిర్వహణతో వ్యవసాయం భవిష్యత్ను నిర్దేశిస్తుందన్నారు.