హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వాసులు ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బతుకమ్మ సందర్భంగా జెన్నారం జడ్పీటీసీ ఎర్ర శేఖర్ బృందం రూపొందించిన ‘సిరిమల్లెలో రామ.. రఘుమల్లెలో’ అనే ప్రత్యేక గీతాన్ని హోంశాఖమంత్రి మహమూద్ అలీతో కలిసి గురువారం ఆమె ఆవిషరించారు.
ఈ కార్యకమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబ్, హజ్ కమిటీ చైర్మన్ సలీం, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ తదితరులు పాల్గొన్నారు.