హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అధ్యాపకులకు కూడా బేసిక్ పే వర్తింపజేస్తూ ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు విడుదలచేసింది. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు 11వ పీఆర్సీ ప్రకారం బేసిక్పేను వర్తింపజేస్తున్నట్టు పేర్కొన్నది. దీంతో కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనాలు 3 0శాతం పెరగనున్నాయి. వేతనాల పెంపునకు సంబంధించి విద్యాశాఖ అధికారులు వేర్వేరుగా జీవోలను జారీచేయాల్సి ఉంది. తాజా నిర్ణయంతో 3,600 జూనియర్ కాలేజీ అధ్యాపకులు, 859 మంది డిగ్రీ లెక్చరర్లు, 450 పాలిటెక్నిక్ కాలేజీ అధ్యాపకులు కలిపి మొత్తం 4,909 మం దికి లబ్ధి చేకూరనున్నది. రాష్ట్రంలో ఉన్న 2,500 పైచిలుకు పార్ట్టైమ్, గెస్ట్లెక్చరర్లకు సైతం పారితోషికాన్ని పెంచారు. బేసిక్ పే అమలుపట్ల కాంట్రాక్టు అధ్యాపకులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం-711 రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం ఆధ్వర్యంలో సిద్దిపేటలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి సహకారంతో కాంట్రాక్ట్ అధ్యాపకు ల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయని తెలిపా రు. ప్రభుత్వ కళాశాలల కాంట్రా క్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ -475 రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేశ్, ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
పారితోషికం పెంపుదల అంచనా
హోదా ప్రస్తుత పారితోషికం పెరుగనున్నది
జూనియర్ కాలేజీ లెక్చరర్లు రూ. 37,100 రూ. 54,220
డిగ్రీ లెక్చరర్లు రూ. 40,270 రూ. 58,850
పాలిటెక్నిక్ లెక్చరర్లు రూ. 40,270 రూ. 58,850
గెస్ట్ లెక్చరర్లకు ప్రస్తుతం పీరియడ్కు రూ.300 ఇస్తుండగా, 30 శాతం పెంపుదలతో రూ. 400కు పెరుగనున్నది. వీరికి నెలకు రూ.21 వేలు పారితోషికంగా ఇస్తుండగా, రూ.28 వేలకు చేరే అవకాశం ఉన్నది.