బాసర, మే 31: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో 2023-2024 విద్యాసంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ను ఇన్చార్జి వైస్ చాన్స్లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్కుమార్ బుధవారం విడుదల చేశారు. టీఎస్ ఆన్లైన్, మీ సేవా కేంద్రా ల్లో admissions@rgukt.ac.in వెబ్సైట్ ద్వారా జూన్ 5 నుంచి 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పీహెచ్, స్పోర్ట్స్, క్యాప్, ఎన్సీసీ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు దరఖాస్తు పత్రాలను జూన్ 24 వరకు పంపించాలని తెలిపారు.
ఎంపికైన విద్యార్థుల జాబితాను జూన్ 26న విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. మొత్తం సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణకు, 15 శాతం సీట్లు ఆంధ్రప్రదేశ్తోపాటు ఓపెన్ కేటగిరీ ద్వారా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. మరో 75 సీట్లలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు రూ.1.37 లక్షలు చెల్లించి అడ్మిషన్ పొందవచ్చునని తెలిపారు. దరఖాస్తు చేసుకున్నవారు ఏవైనా సందేహాలు ఉంటే 7416002245, 7416058245, 7416122245 నంబర్లలో సంప్రదించవచ్చు.