బొమ్మలరామారం, మార్చి 5 : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన బెలిదె రాజుకు చెందిన ఆవు(తులసి) ఇటీవల దూడకు(మీనాక్షి) జన్మనిచ్చింది. ఆవును తమ కుటుంబ సభ్యురాలిగా భావించిన రాజు ఆదివారం ఆవుదూడకు ఘనంగా బారసాల నిర్వహించారు. ఆడపిల్ల పుడితే ఈసడించుకునే ఈ రోజుల్లో ఆవుదూడకు బారసాల నిర్వహించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.