కరీంనగర్ : దేశానికి గాంధీజీ చేసిన సేవలు మరువలేనివని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా కరీంనగర్ పట్టణం కోతిరాంపుర సెంటర్ లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రక్తం చుక్క చిందకుండా దేశానికి స్వాతంత్య్రం సాధించిన గొప్ప నేత గాంధీజీ అన్నారు. ఆయన చూపిన బాటలోనే సీఎం కేసీఆర్ తెలంగాణలో పాలన కొనసాగిస్తున్నారని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై సునీల్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు, కార్పొరేటర్ ఐలెందర్ యాదవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.