హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్కు కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. చెక్బౌన్స్ కేసులో ఒంగోలు రెండో ఏఎంఎం కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఆయనకు ఏడాది జైలు శిక్షతోపాటు రూ.95 లక్షల జరిమానాను కూడా కోర్టు విధించింది. తీర్పును అప్పీల్ చేసుకునేందుకు కోర్టు నెలరోజుల గడువు కూడా ఇచ్చింది.
జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేశ్ నిర్మాణ సంస్థ అయిన పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నుంచి ఇచ్చిన చెక్కు బౌన్స్ అయినా కారణంగా కోర్టులో ఆయన కేసు వేశారు.