లింగాలఘనపురం, ఆగస్టు 18: బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బ్రాహ్మణులను కించ పరిచేలా వ్యాఖ్యానించారు. బండిని ఆశీర్వదించేందుకు వెళ్లిన బ్రాహ్మణులను దారుణంగా హేళన చేశారు. తెలంగాణ బ్రాహ్మణ సంఘం, ధూపదీప నైవేద్య సంఘం, అర్చక సంఘాలు బండి సంజయ్కి జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కుందారం శిబిరంలో గురువారం ఆశీర్వాద కార్యక్రమం ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా పలువురు అర్చకులు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బ్రాహ్మణ పరిషత్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేశారు. రూ.వెయ్యి కోట్లు కేటాయించి పేద బ్రాహ్మణ కుటుంబాల్లో వెలుగు లు నింపుతున్నారు. ఈ విధానం దేశం మొత్తం అమలుకావాలి. మీరు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి జాతీయస్థాయిలో బ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేయించాలి’ అని లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. అసహనానికి గురైన బండి.. ‘మళ్లీ ఆ పార్టీకే ఓట్లెస్తరు.. మాకు ఓట్లే వేయరు.
మిమ్మల్ని ఎలా నమ్మాలి’ అని హేళన చేశారు. ‘మేం అధికారంలోకి వస్తే.. మీ సామాజికవర్గమే కాదు.. అన్ని వర్గాల్లోని పేదలను ఆదుకుంటాం. వేద పాఠశాలలు ఏర్పాటుచేస్తాం.. మీరు నాయకుడిని తయారుచేసుకోండి.. గెలుస్తాడని మాకు నమ్మకం కలిగితే అసెంబ్లీ సీటు కేటాయిస్తాం’ అని బడాయి మా టలు చెప్పి విన్నపాన్ని దాటవేశారు.