కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 20 : ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం కాంగ్రెస్ నేతలకు ఎవరిచ్చారని, ఫామ్హౌస్లు ఏమైనా టూరిస్ట్ కేంద్రాలా అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్ నగరపాలకసంస్థ కార్యాలయ ఆవరణలో ఆదివారం మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల ఫామ్హౌస్ సందర్శన పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఫాంహౌస్ భూములను సందర్శిస్తే అర్థం చేసుకోవచ్చు గానీ, అధికారం కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది కదా అని నేతలు ఫామ్హౌస్ భూముల సందర్శనకు వెళ్లడం ఏందని ప్రశ్నించారు. ఫామ్హౌస్లో ఒకవేళ సరార్ భూములుంటే తక్షణమే స్వాధీనం చేసుకొనే హకు ప్రభుత్వానికి ఉన్నదని తెలిపారు.
బీఆర్ఎస్ నేతలు రూ.లక్ష కోట్ల భూదోపిడీ చేసినట్లు ఆధారాలుంటే ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలకు భయపడే కాంగ్రెస్ అనర్హత కేసులో స్టే కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిందని విమర్శించారు. ఉప ఎన్నికలొస్తే కాంగ్రెస్ను రాజకీయ నిమజ్జనం చేయడం తథ్యమని జోస్యం చెప్పారు. ఉప ఎన్నికల్లో పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ను జనం అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. దానం నాగేందర్ తనను ఖైరతాబాద్ వినాయకుడితో పోల్చుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని, అయితే వినాయకుడిని చివర్లో నిమజ్జనం చేస్తారనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే బెటర్ అని సూచించారు. 22ఏతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యను పరిషరించకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు