హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) సంస్థ పరిధిలో అన్నిరకాల సేవలకు సంబంధించి సమ్మెలను మరో ఆరు నెలలపాటు నిషేధిస్తూ రాష్ట్ర విద్యుత్తు శాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్టీపీసీ హెచ్ఆర్ డీజీఎం నుంచి వచ్చిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఈ నెల 14 నుంచి నిషేధం అమలవుతుందని, అత్యవసర సేవల చట్టం పరిధిలో సమ్మెలను నిషేధిస్తున్నట్టు ఆ ఉత్తర్వులో పేర్కొన్నది.