హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బెయిల్ కోసం కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి తండ్రి వైఎస్ భాసర్రెడ్డితోపాటు మరో నిందితుడు గజ్జల ఉదయ్కుమార్రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు కొట్టేంది. ఇరువురిపై నేరాభియోగాలకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని.. కుట్ర, సాక్ష్యాల తారుమారు వంటి అభియోగాల నేపథ్యంలో బెయిల్ పిటిషన్లను కొట్టేస్తున్నట్టు జస్టిస్ ఎం లక్ష్మణ్ సోమవారం ప్రకటించారు. ఈ కేసులో వివేకా డ్రైవర్ దస్తగిరి, ఇతర సాక్షుల వాంగ్మూలాల విశ్వసనీయతపై కింది కోర్టు విచారిస్తున్నదని, ఎంపీ అవినాశ్రెడ్డి బెయిల్ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నదని హైకోర్టు గుర్తుచేస్తూ.. ఈ దశలో భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డికి బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది.