Telangana | హైదరాబాద్ : తెలంగాణ బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ అధికారి బీ సైదులును ప్రభుత్వం నియమించింది. 2005 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం చార్మినార్ సర్కిల్ సీసీఎఫ్గా పని చేస్తున్నారు. ఆయనను బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల నియామక బోర్డులో సీనియర్ అధికారిగా ఆయనే ఉండటంతో బోర్డు చైర్మన్గానూ వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా, గురుకుల నియామక బోర్డు చైర్మన్గా ఉన్న మల్లయ్య భట్టును ప్రభుత్వం బదిలీ చేసింది.