హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ఐదుగురు నర్సులకు అవార్డులు అందాయి. కొవిడ్ సమయంలో నర్సులు అందించిన సేవలకు గుర్తింపుగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ద న్యూస్ పేపర్ అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక సంయుక్తంగా ‘నేషనల్ ఫ్లారెన్స్ నైటెంగేల్ అవార్డ్-2022’ పేరిట అవార్డులను ప్రదానం చేశాయి. కర్ణాటకలోని బెంగళూరు మెడికల్ కాలేజీ అండ్ రిసెర్చ్ సెంటర్లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే, రాజీవ్ గాంధీ హెల్త్ వర్సిటీ మాజీ వీసీ వర్షిక పుణచ్చా నర్సులకు అవార్డులను అందజేశారు.
అవార్డులందుకున్నది వీరే..
1) సుజాత రాథోడ్ (గ్రేడ్ నర్సింగ్ సూపరింటెండెంట్, ఉస్మానియా దవాఖాన)
2) ఫ్లారెన్స్ (గాంధీ దవాఖాన హెడ్ నర్స్)
3) లక్ష్మణ్ (నీలోఫర్ )
4) మంజుల (నర్సింగ్ సూపరింటెండెంట్, ఈఎస్ఐ )
5) రాజేశ్వరి (రాష్ట్ర ట్రెయిన్డ్ నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు)