చిన్నశంకరంపేట, ఫిబ్రవరి14: గుం డెపోటుతో ఆటోడ్రైవర్ మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మం డలం జంగరాయి గ్రామానికి చెందిన బందెళ్ల శివకుమార్(39) ఆటోడ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకొంటున్నాడు. ఇటీవల ప్రభుత్వం మ హాలక్ష్మీ పథకం ప్రవేశపెట్టడంతో ఆటో లో జనాలు ఎక్కడం లేదని, ఫైనాన్స్ ఎలా కట్టాలని మానసికంగా ఆవేదన చెందగా, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.
దవాఖానలో చికిత్స పొం ది మంగళవారం ఇంటికొచ్చాడు. బుధవారం గుండెపోటుతో మృతి చెందా డు. మృతుడికి భార్య పూర్ణమ్మ, కుమారుడు అక్షిత్ (12), కూతురు దీక్షిత (10) ఉన్నారు. శివకుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ జ్యోతీప్రభాకర్ కోరారు.