హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మరోసారి వేలానికి ప్రభుత్వ భూములను సిద్ధం చేశారు. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ-వేలం ద్వారా ఆన్లైన్లో భూములను విక్రయించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఏర్పాట్లు చేస్తున్నది.
దాదాపు 25 ఎకరాల్లోని 38 ప్లాట్ల వేలానికి ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. వచ్చే నెల 18న వేలం నిర్వహించనున్నారు. ఒక్కో ప్లాటు 700 నుంచి 8,000 చదరపు గజాల విస్తీర్ణం వరకు ఉన్నాయి. వేలంలో పాల్గొనేవారు జనవరి 16లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హెచ్ఎండీఏ తెలిపింది. వచ్చే నెల 4, 5, 6 తేదీలలో ప్రీ బిడ్ సమావేశాలు నిర్వహించనున్నారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 17 ప్లాట్లు, రంగారెడ్డి జిల్లాలో 13, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 8 ప్లాట్లను వేలం వేయనున్నారు.