హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఏపీలోని అన్నమయ్య జిల్లా అంగళ్లులో ఇటీవలి ఘటనలో ముదివీడు ఠాణాలో కేసు నమోదైంది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్రెడ్డి, ఏ4గా రాంగోపాల్రెడ్డిని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదయ్యాయి. మరోవైపు ములకలచెరువు స్టేషన్లోనూ బాబుపై కేసు నమోదైంది. రోడ్షోలో రెచ్చగొట్టే వ్యాఖ్య లు చేశారంటూ వైసీపీ కార్యకర్త చాంద్బాషా ఫిర్యాదు మేరకు పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో చంద్రబాబును ఏ7గా పేర్కొనడం గమనార్హం.