హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : సీనియర్ పీడియాట్రీషియన్ డాక్టర్ అర్జున్పై పోలీస్స్టేషన్ ఆవరణలో దాడి చేయడం హేయమని హెల్త్కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కార్తిక్ నాగుల మండిపడ్డారు.
ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 21న రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ వద్ద మాట్లాడేందుకు వెళ్లిన వైద్యుడిపై దాడిచేయడంతోపాటు, దుర్భాషలాడారని పేర్కొన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.