చెన్నూర్ రూరల్, డిసెంబర్ 30: బీసీ కులానికి చెందిన వారిని అరేయ్ అన్నందుకు ఓ దళిత యువకుడి ప్రాణం పోయింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని ఎర్రగుంటపల్లిలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 26న సాయంత్రం గ్రామానికి చెందిన దళిత యువకుడు ఆకుదారి సంపత్(25) కోడిగుడ్లు కొనేందుకు గ్రామంలోని ఓ కిరాణానికి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన వీరబోయిన సతీశ్ యాదవ్, పంది మహేశ్, అలుగునూరి అరుణ్ అప్పటికే అక్కడ ఉన్నారు.
అందులో సంపత్కు సతీశ్తో అంతకుముందే పరిచయం ఉంది. ఈ క్రమం లో అరేయ్ అని పిలవడంతో ఘర్షణ తలెత్తింది. ‘తక్కువ కులం వాడివి నన్ను అరేయ్ అంటవా’ అంటూ కోపోద్రిక్తులై సతీశ్తోపాటు మిగతా ఇద్దరు యువకులు సంపత్పై దాడి చేశారు. దీంతో సంపత్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సంపత్ను చెన్నూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మం చిర్యాలకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సంపత్ శనివారం మృతి చెందాడు.