బండ్లగూడ, జూన్ 6: ప్రభుత్వం ఇటీవల ఎంపిక చేసిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ (ఏపీపీ) కు సోమవారం నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీలో ఇస్తున్న శిక్షణ తరగతులను తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్త ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీపీలకు మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ బోర్డు చైర్మన్ శ్రీనివాస్, డైరెక్టర్ వైజయంతి, తెలంగాణ అకాడమీ డైరెక్టర్ వి.వి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.