మహబూబ్గర్/మహబూబ్నగర్ టౌన్, జూన్ 4: కష్టకాలంలో ప్రతిఒక్కరూ సేవ చేయడం అలవాటు చేసుకోవాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానలో జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా వార్డులో పనిచేస్తున్న కార్మికులకు శుక్రవారం శ్రీనివాస్గౌడ్ నిత్యావసర సరుకులు అందజేశారు. 120 మంది సిబ్బందికి 25 కిలోల చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, గోధుమపిండి, మంచినూనె తదితర సరుకులను అందించామని మంత్రి తెలిపారు. మరో 100 మందికి కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రైస్ మిల్లర్స్ సంఘం కార్యదర్శి విజయ్కుమార్ తెలిపారు. పాల్కొండ 9వ వార్డులో రూ.3.80 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు.