హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాల్లో శుక్రవారం ‘రోల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్’ అంశంపై అసెంబ్లీ ఎస్సీ అభివృద్ధి కమిటీ సమావేశం చైర్మన్ కాలే యాదయ్య అధ్యక్షతన జరిగింది.
ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, మెతుకు ఆనంద్, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, పోలీస్ అడిషన్ డీజీలు జితేందర్, మహేశ్ ఎం భగవత్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హోంశాఖ పరిధిలో జరిగిన భర్తీ ప్రక్రియలో అనుసరించిన రిజర్వేషన్లపై సమీక్షించారు.