గువాహటి, అక్టోబర్ 3: రాష్ట్రంలోని ఐదు ముస్లిం కులాల సామాజిక-ఆర్థిక స్థితిగతులపై సర్వే చేయాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం హిమంత బిశ్వ శర్మ అధికారులను ఆదేశించారు. ముస్లిం వర్గాలైన గోరియా, మోరియా, దేశీ, సయ్యద్, జోల్హాల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సర్వే చేసి నివేదిక సమర్పించాలని మంగళవారం ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.
దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇది బీజేపీ విభజన కుట్రలో భాగమని ఆరోపించాయి.