ఆసిఫాబాద్, ఫిబ్రవరి 3 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసిరింది. ముఖ్యంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా, గడ్డ కట్టుకుపోయే పరిస్థితి నెలకొన్నది. శుక్రవారం కనిష్ఠంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో 6.1 డిగ్రీలు, ఆదిలాబాద్లో 7.7, నిర్మల్ జిల్లాలో 9.7, మంచిర్యాలలో 10.7 డిగ్రీల సెల్సియస్కు పడిపోగా.. ప్రజలు గజగజ వణికిపోయారు.
ఉదయం తొమ్మిది గంటల దాకా మంచు కమ్ముకోగా, వాహనాల రాకపోకలకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇక సాయంత్రం ఆరింటికే ఇగం మొదలుకాగా, రోడ్లపై జనం పలుచగా కన్పించారు.