హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ లోకేశ్వర్రావు సజ్జాకు మరో అరుదైన గౌరవం దక్కింది. మహిళల్లో ‘కరోనరీ ఆర్టరీ బైపాస్’ సర్జరీలపై డాక్టర్ సజ్జా జరిపిన అధ్యయన ఫలితాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ థొరాసిక్ అండ్ కార్డియోవాస్కులర్ సర్జరీ పత్రిక ప్రచురించింది.
ఏషియన్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ సంస్థ డాక్టర్ లోకేశ్వర్రావుకు తమిళనాడులో ఈ నెల 3న ‘ఏషియా బెస్ట్ రీసెర్చ్ అవార్డ్ ఇన్ కార్డియాక్ సర్జరీస్’ను ప్రదానం చేసింది. ఇటీవలే సజ్జాకు ఇండియన్ ఐకాన్ అవార్డు వరించింది.