హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ), టీ హబ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మంగళవారం హైదరాబాద్ రాయదుర్గం ఐటీ కారిడార్లోని టీ హబ్లో ఈ ఒప్పందంపై ఇరు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా ఆవిష్కరణల ప్రోత్సాహం, టెక్నాలజీ ఆధారిత స్టార్టప్ కంపెనీలకు మద్దతు ఇవ్వనున్నాయి.
ఈ ఒప్పందం ద్వారా వ్యవస్థాపక శిక్షణ మరియు సామర్థ్య పెంపునకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు తెలిపారు. మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో వాస్తవ ప్రపంచ సమస్యలను పరిషరించే లక్ష్యంతో ఇన్నోవేషన్ చాలెంజ్లు, హ్యాకథాన్లు, ఇంక్యుబేషన్, యాక్సిలరేషన్ ప్రోగ్రాంలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఒప్పందం ఏడాది పాటు కొనసాగుతుందని ఏఎస్సీఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నిర్మల్య బాగ్చి తెలిపారు.