హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): తమిళనాడులోని తిరుచిరాపల్లి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) గవర్నర్స్ బోర్డు మెంబర్గా దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్త్రీ (డిక్కీ) తెలంగాణ చాప్టర్ అధ్యక్షురాలు దాసరి అరుణ నియమితులయ్యారు. శుక్రవారం యూపీలోని సోషల్ వెల్ఫేర్ మంత్రిత్వ (స్వతంత్ర) శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్రమంలో అంకితభావంతో పనిచేస్తున్న దాసరి అరుణను ఐఐఎం సభ్యురాలిగా నియమించడం హర్షణీయమని డిక్కీ ప్రతినిధులు తెలిపారు.