హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్ ఏవోసీ సెంటర్లోని థాపర్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని డిసెంబర్ 29 నుంచి 2024 మార్చి 10 వరకు నిర్వహిస్తున్నట్టు డిఫెన్స్ విభాగం అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ జీడీ, అగ్నివీర్ టెక్, అగ్నివీర్ అడ్మిన్/అసిస్టెంట్/ఎస్కేటీ/ ట్రేడ్స్మెన్స్ కోసం దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు17 ఏండ్ల నుంచి 21 ఏండ్లలోపు ఉండాలని పేర్కొన్నారు. సందేహాలుంటే tuskercrc-2021@gov.inకు మెయిల్ చేయాలని, వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.