దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ పబ్బల్ల అనిల్ స్మృత్యార్థం కుటుంబ సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్కాపూర్లో నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆర్మీలో సీఎఫ్ఎన్ టెక్నీషియన్ అయిన అనిల్ గతేడాది మే4న జమ్మూ కశ్మీర్లో ధ్రువ్ హెలీకాప్టర్ ప్రమాదంలో అమరుడయ్యారు. కుటుంబ సభ్యులు అనిల్ విగ్రహాన్ని పొలం వద్ద ఏర్పాటు చేయగా శుక్రవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో అనిల్ సతీమణి సౌజన్య ఆవిష్కరించారు. – బోయినపల్లి