పరకాల, జనవరి 14: గుండెపోటుతో ఆర్మీ మేజర్ మృతి చెందాడు. వరంగల్ జిల్లా పరకాల పట్టణానికి చెందిన దూడపాక సాయికిరణ్ (32) ఆర్మీ మేజర్గా జమ్ము కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సంక్రాంతి పండుగ కోసం సెలవుపై నాలుగు రోజుల క్రితం పరకాలకు వచ్చాడు. కుటుంబ సభ్యులతో సరదాగా ఉన్న సాయికిరణ్ శనివారం ఇంట్లో బాత్రూమ్కు వెళ్లి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. హఠాత్తుగా ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో కుర్చీలోనే కూలబడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.