హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మీ ఉద్యోగార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఆర్మీ అధికారులతో చర్చలకు 10 మంది రావాలని వారిని పోలీసులు కోరినప్పటికీ అంగీకరించడం లేదు. వస్తే చర్చలకు అందరం వస్తాం.. కానీ పది మంది అయితే వచ్చే ప్రసక్తే లేదని యువకులు తేల్చిచెప్పారు. ఆర్మీ అధికారులతో చర్చలకు యువకులు నిరాకరించారు. ఆర్మీ నియామక అధికారి తమ వద్దకే వచ్చి చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. చావడానికైనా సిద్ధం.. కానీ చర్చలకు రాం అని స్పష్టం చేశారు. ఇంకా పట్టాలపైనే యువత ఉన్నారు. స్టేషన్లోనే కూర్చొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. యువకుల ఆందోళనలతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు.