హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు చెందిన చనాక-కొరాట (ఆదిలాబాద్ జిల్లా), ముక్తీశ్వర (చిన్నకాళేశ్వరం) భూపాలపల్లి జిల్లా, చౌటుపల్లి హన్మంత్రెడ్డి నిజామాబాద్ జిల్లా ఎత్తిపోతల పథకాలకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు లభించాయి. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధ్యక్షతన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం గత నెలలో జరిగింది. ఆ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన మూడు ప్రాజెక్టుల అనుమతులపై చర్చించారు. తుదకు తెలంగాణ ప్రభుత్వ వాదనలు, ప్రతిపాదనలకు టీఏసీ సానుకూలత వ్యక్తం చేసింది. ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు మంజూరు చేసింది. ఆ మీటింగ్ మినిట్స్ను జారీ చేసింది. తెలంగాణ ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతున్నట్టు వెల్లడించింది.