యాదాద్రి, మార్చి15: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో యాదాద్రీశుడికి సంప్రదాయ పూజలు వేకువజామునే మొదలయ్యాయి. సోమవారం ఉదయం నాలుగు గంటల నుంచి స్వామి వారిని బాలాలయంలో కవచమూర్తులకు ఆరాధనలు జరిపి, పంచామృతాలతో ని జాభిషేకం నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగం గా స్వామి వారికి పట్టువస్ర్తాలు ధరింపజేసి వివిధ పుష్పాల తో శోభాయమానంగా అలంకరించారు. తులసి అర్చనలు జరిపి, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బ్రహ్మోత్సవా లకు శ్రీకారం చుట్టారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొని, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల నేప థ్యం లో స్వామి వారి ఆర్జిత సేవలను నిలిపివేశారు.
యాదాద్రీశుడి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వతవర్ధ్దినీ సహిత రామలింగేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు పాల్గొని రుద్రాభిషేకం జరిపించారు. ఉదయాన్నే పరమశివుడికి ఆవుపాలు, పం చామృతాలతో అభిషేకించి శివలింగాన్ని అర్చించారు. విభూతితో అలంకరించారు. ఆలయంలోని సుబ్రహ్మ ణ్య స్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చన చేశారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఖజానాకు రూ. 12,24,285 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.85,914, రూ. 100 దర్శనాలతో రూ.30,900, వీఐపీ దర్శనాలతో రూ. 57,900, కైంకర్యాల ద్వారా రూ.600, సుప్రభాతంతో రూ.2,200, క్యారీబ్యాగులతో రూ.5,550,సత్యనారాయ ణ స్వామి వ్రతాలతో రూ.83,500, కల్యాణకట్టతో రూ. 36,640, ప్రసాద విక్రయాలతో రూ. 6,34,600, శాశ్వత పూజలతోరూ.10,116, వాహనపూజలతో రూ. 13,300, టోల్ గేట్ ద్వారా రూ. 1,470, అన్నదాన విరాళంతో రూ. 13, 049, సువర్ణపుష్పార్చనతో రూ.93,152, యాదరుషి నిలయంతో రూ.74,710, పుష్కరిణితో రూ.500, శివాల యం ద్వారా రూ. 2,416, పాతగుట్టతో రూ. 25,030, ఇతర విభాగాలతో రూ. 52,408తో కలిపి రూ. 12,24, 285 ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు.