హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): మైనారిటీలకు రూ.లక్ష సాయం పథకానికి క్రిస్టియన్ మైనార్టీల నుంచే దరఖాస్తులు స్వీకరిస్తామని మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ముస్లిం మైనార్టీల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించామని, వారు మళ్లీ ఐప్లె చేయాల్సిన అవసరంలేదని స్పష్టంచేశారు.
క్రిస్టియన్ మైనారిటీలు సోమవారం నుంచి ఆగస్టు 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 21 నుంచి 55 సంవత్సాలు ఉండి, వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల మించనివారు <https://tsobmmsbc. cgg.gov.in> వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని వెల్లడించారు.