హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఎన్టీఆర్ ట్రస్ట్ మెరిట్ స్కాలర్షిప్నకు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 15 వరకు www.ntrcollegeforwomen.education వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. పదోతరగతి చదువుతున్న విద్యార్థినులు ఇందుకు అర్హులని వెల్లడించారు. ఈ స్కాలర్షిప్ టెస్ట్ డిసెంబర్ 17న నిర్వహిస్తామని పేర్కొన్నారు.
పరీక్షల్లో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్ విద్యా సంస్థల ద్వారా ఉపకారవేతనం అందజేస్తామని వెల్లడించారు. మొదటి 10 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.5వేల చొప్పున, తర్వాత 15 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.3వేలు చొప్పున ఇంటర్ పూర్తి చేసే వరకు ఇస్తామని వివరించారు.