హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాలు, హైవేలపై మొత్తం 615 ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహన కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేట్ వ్యక్తులను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. వివరాలకు టీఎస్ రెడ్కో కేంద్ర కార్యాలయంలో, జిల్లాలోని సంస్థ కార్యాలయాల్లో లేదా https://tsredco.telanga na.gov.in/ వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు. ఇప్పటికే హైదరాబాద్లో 405 ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2025 నాటికి మూడు వేల ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు.