హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): క్రిస్మస్ సంబరాల్లో భాగంగా అందించే అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. సామాజిక, విద్యా, వైద్య, సాహిత్యం, కళలు, క్రీడారంగాల్లో ప్రతిభావంతులను, సంస్థలను ఏటా ప్రభుత్వం సతరిస్తుంది.
ఈ మేరకు ఆయా రంగాల్లో 30 ఏండ్లకు పైబడి సేవ చేసిన, ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్టు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్లోని క్రైస్తవ (మైనార్టీ) ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కార్యాలయం నుంచి కానీ లేదా www.tscmfc.in వెబ్సైట్ నుంచి కానీ నామినేషన్ ఫారాలను పొందవచ్చని పేర్కొన్నది. ఈ నెల 12,13 తేదీల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయాల్లో నామినేషన్లను అందజేయాలని లేదా ఈ నెల 15లోగా చేరేలా పోస్ట్లో పంపాలని పేర్కొన్నది. మరిన్ని వివరాలకు 040-23391067 నంబరులో సంప్రదించాలని కోరారు.