PGRRCDE | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రమైన ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్ సీడీఈ) ద్వారా అందించే ఎంబీఏ కోర్సు పరీక్షల జవాబు పత్రాల నకలు పొందేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంబీఏ మొదటి, మూడో సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపరు రూ.1,000 చొప్పున చెల్లించి ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ఫలితాలపై చాలెంజ్ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఒక్కో పేపర్కు రూ.10,000 చొప్పున చెల్లించి వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.