హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకులాల్లోని ఇంటర్ (సీవోఈ) కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ తెలిపారు. ఈ ఏడాది పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్ గ్రూప్లలో ప్రవేశాలకు అర్హులు అని పేర్కొన్నారు. వివరాలకు www.tswreis.ac.in, http://www.tswreis.ac.in వెబ్సైట్లను సంప్రదించాలని సూచించారు.