హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): 15 కొత్త బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు గడువును ఈనెల 20 వరకు పొడిగించామని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. ఇంటర్ మారుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. బీఎస్సీ బీజడ్సీ, ఎంపీసీ, కంప్యూటర్ సైన్స్, బీఏహెచ్ఈపీ కోర్సులతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బీబీఏ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. వివరాలకు 040-233282 66,myptbcwreis.telangana.gov. in ను సంప్రదించాలని సూచించారు.