హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో తెలుగేతర మీడియాల్లో చేరి.. సింపుల్ తెలుగు సబ్జెక్టును తీసుకున్న విద్యార్థులు వార్షిక పరీక్షల్లో 20 మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఈ మార్కులు సాధిస్తే వారు పాస్ అయినట్టే లెక్క. ఈ ఏడాది ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ వంటి మాధ్యమాల్లో చదువుతూ తొలిసారిగా తెలుగును ద్వితీయ భాషగా తీసుకున్న పదో తరగతి విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలు రాయనున్నారు. తెలుగు తప్పనిసరి అమలు చట్టం -2018తో అన్ని మీడియాల్లోని విద్యార్థులు తెలుగును సబ్జెక్టును తీసుకోవడం అనివార్యమైంది.
2023లో జరిగే ఎస్సెస్సీ వార్షిక పరీక్షల్లో వీరంతా తెలుగు సబ్జెక్టు పరీక్ష రాయనున్నారు. ఏ మీడియం వారికైనా తెలుగు, ఇంగ్లిష్ తప్పసరికాగా, వారి వారి మాతృభాషను సైతం ఒక సబ్జెక్టుగా తీసుకొనే అవకాశం ఉన్నది. ఈ ఏడాది సింపుల్ తెలుగు పేపర్కు వార్షిక పరీక్షను నిర్వహించే అంశం, పరీక్షను ఒకే రోజు నిర్వహించాలా.. లేక వేర్వేరు తేదీల్లో నిర్వహించాలా అన్న అంశంపై ఎస్సీఈఆర్టీ, ఎస్సెస్సీ బోర్డు అధికారు లు బుధవారం చర్చించారు. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
మూడు రకాలుగా
ఇతర బోర్డుల్లో సైతం..
ఈ విద్యాసంవత్సరంలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి బోర్డుల విద్యార్థులకు పదో తరగతి వార్షిక పరీక్షల్లో తెలుగు తప్పనిసరిగా ఉండనున్నది. వీరికి ఆయా బోర్డులే పరీక్షలు నిర్వహిస్తాయి.